హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మహబూబ్నగర్ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లడం రాజకీయ చర్చకు కారణమైంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డితో కలిసి సీఎం రేవంత్ గురువారం జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికివెళ్లి భేటీ అయ్యారు. జితేందర్రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకే సీఎం ఆయన ఇంటివెళ్లారన్న ప్రచారం జోరుగాసాగింది. ఈ వార్తలపై స్పందించిన జితేందర్రెడ్డి అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు.
తనకు టికెట్ దక్కకపోవడంతో పరామర్శించేందుకే సీఎం వచ్చారని, తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని స్పష్టంచేశారు. తాను బీజేపీలోనే ఉన్నానని, తన భవిష్యత్తును పార్టీయే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. టికెట్ దక్కకపోవడం బాధ కలిగించినా, పార్టీలో కొనసాగాలా? వద్దా? అనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని జితేందర్రెడ్డి స్పష్టంచేశారు.