CM Revant Reddy | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
తక్షణమే సహాయ చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరారు.