Congress | జనగామ, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ పదేండ్ల పాలన అన్ని వర్గాలను మెప్పించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అంగీకరిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి ఎన్నికల ప్రచార సభలో జై కేసీఆర్ అంటూ నినదించారు. ఆమెతో గ్రామస్థులు సైతం గొం తు కలిపి జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్ అనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ వీడి యో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తో పోటీ పడుతున్న యశస్విని మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండ లం మడిపెల్లిలో ఎన్నికల ప్రచార రథంపై నుం చి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. ము గింపులో ఇక ఉంటా అంటూ జై కేసీఆర్ అని ని నదించడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకు లు బిత్తరపోయి మేడం అనడంతో ఆ మె వెంట నే తేరుకొని జై కాంగ్రెస్ అన్నారు. ఇ దంతా చూసిన గ్రామస్థులు ఈలలు కొట్టి ఒక్కసారిగా గొల్లున నవ్వుకున్నారు. మేడం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా కేసీఆర్ అంటే అభిమానం, బీఆర్ఎస్ అంటే ప్రేమ ఉన్నట్టుంది అంటూ గుసగుసలాడారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి నోట జై కేసీఆర్ నినాదం రాజకీయ దుమారానికి దారితీసింది.
తెలంగాణ ప్రజల గుండెల్లోనే కాదు, ప్రత్యర్థుల మనసుల్లో కూడా ఉన్నది కేసీఆరే.
కేసీఆర్ కే జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి!#KCROnceAgain #VoteForFor pic.twitter.com/CG8nrrQMn0
— BRS Party (@BRSparty) November 21, 2023