కరీంనగర్ : బీసీ కులాల ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించే వ్యక్తి సీఎం కేసీఆర్. వేల కోట్ల విలువగల 82.30 ఎకరాల భూములను ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడంహైదరాబాద్ నడిబొడ్డున కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఆదివారం ఉప్పల్ బగాయత్లో సోమవంశ సహస్రార్జున క్షత్రియ (పట్కర్) ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా ఉందన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో బీసీలు వెనుకకు నెట్టివేయబడ్డారని, వారి సర్వతో ముఖాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా భవనాల్ని నిర్మిస్తున్నామని, ఇప్పటికే 25 కుల సంఘాలు ఏకగ్రీవమై భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉంన్నాయన్నారు.
19 స్కూల్స్ నుంచి 281 గురుకులాలను పెంచామని, కులవృత్తి చేసుకునే రజక, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటుతో పాటు కల్యాణ లక్ష్మి పథకం ఇంకా ఇతర అనేక పథకాల ద్వారా బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ క్షత్రియ సమాజ అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్. ప్రతినిధులు శ్రీనివాస్ కోడే, రామ్ చందర్, షికారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.