హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీని పరిరక్షించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తుంటే.. కేంద్రంలోని పెద్దలు కామధేనువు లాంటి ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటీకరించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎస్సీజెడ్ఐఈఎఫ్) ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుబీమా క్లెయిమ్లను ఎల్ఐసీ నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పజెప్పేది లేదని ఇటీవల ఖమ్మం బీఆర్ఎస్ సభ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలపై కేసీఆర్కు ఉన్న ప్రేమ, కేంద్రంలోని నాయలకులకు ఇసుమంతైనా లేద ని మండిపడ్డారు.
రైతుబీమాను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే క్లెయిమ్స్ చెల్లింపుల్లో గ్యారంటీ ఉండదని గతంలోనూ కేసీఆర్ ప్రకటించారని, సేవల్లో ఎల్ఐసీ ఎంత విశ్వసనీయతను కొనసాగిస్తుందో ఆయన మాటల్లోనే అర్థమవుతున్నదని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఒక రాష్ట్ర సీఎం పాటుపడుతుంటే.. కేం ద్రంలోని నేతలకు కనువిప్పు కలుగకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఎల్ఐసీకి ఆయువుపట్టయిన ఏజెంట్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయాలను అంగీకరించబోమని తే ల్చి చెప్పారు. ఎల్ఐసీని ప్రైవేటీకరణ విధానాలను ఎండగట్టేందుకు ఉద్యోగులు, సిబ్బందిని నిరంతరం చైతన్యం చేస్తూ ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.