ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికపై హర్షం
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన గౌరవమని ప్రశంస
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఆసియా ఖండం నుంచి తొలిసారిగా అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం (ఇస్టా) అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ కే కేశవులును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బుధవారం ప్రగతిభవన్లో కేశవులు సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. తెలంగాణ విత్తనరంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా పని చేయాలని కేశవులుకు సూచించారు.