హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5 వేల ఎకరాల్లో రూ. 30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.