CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్పై తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్.. బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో కేంద్రం మొండి చేయి చూపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి వున్నదని అని సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.