హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సమావేశం మొదలుకానున్నది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. ఉత్తమ పారిశుద్ధ్య గ్రామాలుగా తెలంగాణ పల్లెలు ఎంపికయ్యాయి. ఈ రెండు కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యం పెరిగింది.
మొక్కలు నాటే కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను మరింత వేగంగా చేపట్టాలని భావించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రస్థాయిలో స మావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రు లు, సీఎస్, జడ్పీ చైర్మన్లు, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.