మహహబూబ్నగర్, ఫిబ్రవరి 7 : ఎస్సీలను సంపన్నులను చేసేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. భవిష్యత్తు లో వారు ఆర్థికంగా నిలదొక్కుకొని కార్లలో తిరిగే పరిస్థితి తీసుకొస్తామని ధీమా వ్యక్తంచేశారు. మహబూబ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితబంధు అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. పథకం కింద అత్యంత పేదలైన ఎస్సీలను గుర్తించాలని ఆదేశించారు. స్థానికంగానే ఎక్కువ ఉపాధి లభించే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంబంధితశాఖల అధికారులు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.