ముస్తాబాద్, ఫిబ్రవరి 22 : సీఎం కేసీఆర్ పెద్దనాన్న కుమారుడు చక్రధర్రావు (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) ఈ నెల 17న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఆయన కుటుంబసభ్యులను సీఎం సోదరి వెన్నమనేని వినోద, వెన్నమనేని పూర్ణచందర్రావుతో కలిసి సీఎం కేసీఆర్ సతీమణి శోభ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె చక్రధర్రావు కుటుంబ సభ్యులను ఓదార్చి, అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. చక్రధర్రావు భార్య పరంధామ, కుమారుడు వరప్రసాద్రావు, కూతుళ్లు రజినీ నాగేంద్రరావు, వసుధా రత్నాకర్రావుతో మాట్లాడారు. అంతకు ముందు చక్రధర్రావు చిత్రపటానికి నివాళులర్పించారు. శోభ వెంట సర్పంచ్ కల్వకుంట్ల వనజ తదితరులు ఉన్నారు.