మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదరించి అభివృద్ది పరుస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం క్రిష్టియన్ సోదరులకు అందజేస్తున్న దుస్తులను మంత్రి బుధవారం ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శాంసన్ చైర్మన్లు ఎం.పావని, బి.కొండల్రెడ్డి, కౌన్సిలర్లు టీతదితరులు పాల్గొన్నారు.