హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకుంటారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ తన కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. బాలాలయం ఆవరణలో ‘కళావేదిక’కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు.
కాగా, సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రతా కారణాలతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో యాదగిరిగుట్టకు వెళ్తుండటంతో ఎన్ఆర్జీఐ మెట్రోస్టేషన్, ఉప్పల్ ఎక్స్రోడ్, బోడుప్పల్, మెక్డొనాల్డ్స్, ఘట్కేసర్, బీబీనగర్, యాదాద్రి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.