ఇబ్రహీంపట్నం, మే 28: బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్రావు ఆదివారం పరామర్శించారు. ఇటీవల కిషన్రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె దశదినకర్మ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, జీ జగదీశ్వర్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బాల్క సుమన్, జైపాల్యాదవ్, కేపీ వివేకానంద, ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, శంభీపూర్రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.