హైదరాబాద్: దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనున్నారు.