న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తోపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కూడా పాల్గొంటారు. గల్వాన్లోయలో మరణించిన వీరజవాను కుందన్కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఇతర రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు సాయం అందించనున్నారు.
రాంచీలో సీఎం కేసీఆర్కు అభిమానులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. రాంచీలో ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్ పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పటు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ పెరుగుతున్నది. తాజాగా సైనికుల కుటుంబాలకు ఆర్థిక అందించడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.