హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.
ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో హెచ్ఎండీఏ అధికారులు నెలకొల్పారు. అంతకుముందు సికిద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.