హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణకుమారి మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి తయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన గవర్నర్ తమిళిసై మాతృమూర్తి కృష్ణకుమారి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని రాజ్భవన్లో ఉంచనున్నారు. అనంతరం ఆంత్యక్రియల కోసం చెన్నైకి తరలించనున్నారు.