హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అమీర్పేటలోని ఆయన నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రోశయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురవడంతో నగరంలోని స్టార్ హాస్పిటల్కు తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.