హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు.
సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందిస్తారు. బీహార్ సీఎం నితీశ్కుమార్తో కలిసి అమర జవాన్లు, కార్మికుల కుటుంబాలకు చెకులు పంపిణీ చేస్తారు. అనంతరం సీఎం నితీశ్కుమార్ ఆహ్వానం మేరకు అధికారిక నివాసంలో కేసీఆర్ మధ్యా హ్న భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.