హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొననున్నారు.
27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో సీఎం కేసీఆర్ సభలు జరుగనున్నాయి. మిగతా సభలు యథావిధిగా ఉంటాయి.