హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని సుల్తాన్పూర్లో జరుగునున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. మంత్రి సబితా రెడ్డి రెడ్డి మరోసారి గెలిపించాలని కోరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్ నియోజకవర్గానికి చేరుకుంటారు. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో జరుగనున్న సభలో పాల్గొంటారు. అనంతరం జహీరాబాద్, పటాన్చెరులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా నల్లగొండ జిల్లాలోని హుజుర్నగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో రోడ్ షో నిర్వహించనున్నారు.