హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్పవార్తో భేటీ అవుతారు.
కాగా, ముంబైలోని తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మహానగరంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దారిపొడవునా సీఎం కేసీఆర్కు సంబంధించిన హోర్డింగులు, సైన్ బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ఉద్ధవ్ థాక్రే నివాసం ‘వర్ష’ వరకు అడుగడుగునా భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు.