హైదరాబాద్, ఫిబ్రవరి 16 : బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ర్టాల హక్కుల కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అద్భుత పోరాటం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు పలికారు. బీజేపీపై పోరాటంలో దేశ ప్రజలను కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్కు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ఫోన్ చేసి మాట్లాడారు. ‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారు. రాష్ట్రాల హకుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం. మిమ్మల్ని ముంబైకి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని సీకరించాలి. అదే సందర్భంలో బీజేపీపై పోరాటంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానించారు. ఉద్ధవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 20న సీఎం కేసీఆర్ ముంబై వెళ్లి ఆయనతో సమావేశం కానున్నారు.