జగిత్యాల, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంసరణలు చేపట్టారని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, గ్రామాలు, మండలాలు, పట్టణాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి ప్రజల చెంతకే పాలను తెచ్చిన ఘనత ఆయనకే దకుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ జీ రవిని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్ భవనం సీఎం కేసీఆర్ దూరదృష్టికి ప్రతిరూపమన్నారు. ఇంకా రెండు ఐడీవోసీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో మిగిలిన భవనాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రం ఏం సాధించిందో అనేదానికి ఇది ఒక సింబల్లా నిలిచిపోనున్నదని చెప్పారు. ప్రతి ఊరిలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తుతో పాటు తెలంగాణ హరితహారం కార్యక్రమం చేపట్టడం ద్వారా 7.7% పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 తెలంగాణకు చెందినవి ఉండటం ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టిందన్నారు.