ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే రెండు మూడ్రోజులు ఉండనున్నారు. జాతీయ స్థాయి నాయకులను కలువనున్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలపై వారితో మాట్లాడనున్నారు.