త్వరలోనే వాటర్వర్క్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 25 : సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో టీఆర్ఎస్కేవీ అనుబంధ వాటర్వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జీవో 14 అమలు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో వాటర్వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం సంతోష్, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, బాలరాజు, శ్రీనివాస్రెడ్డి, సురేశ్, నరేందర్, పాండు, రామ్చందర్ పాల్గొన్నారు.