CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసి.. దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. పట్వారీల రాజ్యం తీసుకువస్తామంటోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ ధరణిని పోర్టల్ను తీసుకువచ్చాం. దాంతో రైతు నిశ్చింతంగా రైతుగుండెల మీదేసుకొని ఉన్నడు. ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని రైతులకు ఇచ్చాం. రైతుల బొటనవోలు పెడితేనే మారుతుంది. లేకపోతే నెత్తికొట్టుకున్నా మారదు. ధరణిని తీసి వేసి భూమాత అని పెడుతటర. భూమాతనా.. భూమేతనా? ఆలోచన చేయాలి. మేం రైతుబంధును హైదరాబాద్లో విడుదల చేస్తే సక్కగా బ్యాంకులోకి వస్తున్నయ్. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా వస్తుంది ?’ అని ప్రశ్నించారు.
‘మళ్లీ కౌలుదారు కాలమ్ పెడుతం. మళ్లీ వీఆర్వోలను తెస్తామని కుల్లాగా చెబుతున్నరు. దారి అర్థం ఏందీ? మళ్లీ సేమ్ పాత రాజ్యం. మళ్లీ ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాలి. పోతే ఏడెకరాలున్నదంటూ రూ.30వేలు లావో లేకపోతే సంతకం పెట్ట అంటడు. వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లయితది. మళ్లీ దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం. పట్వారీల రాజ్యం.. మళ్లీ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేదాక తిరుగుడు తప్పదు. మీ అకౌంట్ నంబర్లు ప్రభుత్వం వద్ద ఉన్నయ్ కాబట్టి.. వెంటవెంటనే వేసిన డబ్బులు మీకు వస్తున్నయ్. రేంపు ఏం గతి అవుతుంది ? ఆలోచన చేయాలి ? ఇది సీరియస్ మ్యాటర్. రైతుల జీవన్మరణ సమస్య. శ్రీనివాస్గౌడ్ ఎంత పని చేశారు. మహబూబ్నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లయ్యింది ? బైపాస్ రోడ్డు కావాలని నా పాణం తీసి బ్రహ్మాండంగా బైపాస్ రోడ్డు వేయించాడు. మొన్న అదే బైపాస్రోడ్డులో పోయిన. చాలా సంతోషం కలిగింది. ఆ చెరువు ఎట్లుండే.. మురికి గుంట. అన్నీ కంప చెట్లు అడుగుపెట్టరాకుండా ఉండే. చెరువు ఎంత సుందరంగా తయారైంది. మీదగ్గర పెట్టిన ఏకో పార్క్ను హైదరాబాద్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి దాన్ని చూసిపోతున్నరు. మహబూబ్నగర్ పట్టణం పక్కనే ఉన్న ఏకో పార్క్ మన తెలంగాణలోని ఏ నగరానికి కూడా లేదు’ అన్నారు.
‘సీఎంఆర్ఎఫ్ రూ.30కోట్లు తీసుకొచ్చి పంచిండు శ్రీనివాస్గౌడ్. ఆయన పట్టుదల ఉన్న వ్యక్తి. నాకు ఐటీ టవర్ కావాలని తీసుకొచ్చి పెట్టిండు. నాకు ఇండస్ట్రీస్ రావాలన్నడు. దివిటిపల్లిలో రూ.10వేలకోట్లతో అమర్రాజా బ్యాటరీ కంపెనీ వచ్చింది. శ్రీనివాస్గౌడ్ సహకారం లేకపోతే ఆ ఫ్యాక్టరీ వచ్చేది కాదు. మాది వెనుకబడిన జిల్లా అని వెంటపడి తీసుకువచ్చిండు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పాత పాలమూరు జిల్లాల్లో వచ్చినయ్. కేసీఆర్కన్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు ఎందరు ముఖ్యమంత్రులు కాలే.. ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా? ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు పని చేస్తున్నరు. మహబూబ్నగర్లో శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంతకు ముందు ఎందరో ఎమ్మెల్యేలు అయినా వాళ్ల పని చేసుకొని పోయారు. రైతులు, పేదలు, పట్టణం గురించి పట్టించుకోలేదు. మంచివాళ్లు గెలిస్తేనే మంచి జరుగుతుంది. చెడ్డవాళ్లు గెలిస్తే మళ్లీ మొదటికే వస్తుంది. మీ తలరాత రాసేది మీ చేతుల్లోనే ఉన్నది. జాగ్రత్తగా ఓటు వేయాలని కోరుతున్నా. భారీ మెజారిటీతో శ్రీనివాస్ గౌడ్ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.