CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నీట్, ఇతర పోటీ పరీక్షల్లో చాలా సీట్లు మనకు వస్తున్నాయి. ఈ ఫలితాలను చూసిన తర్వాత అగ్రవర్ణ కులాలు కూడా మాకు రెసిడెన్షియల్స్ స్కూల్స్ కావాలని అడిగారు. అగ్రవర్ణాల్లోని పేద పిల్లల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం. మైనార్టీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా మార్చుతాం అని కేసీఆర్ పేర్కొన్నారు.