హైదరాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ) : మానవ సంబంధాల్లోని పవిత్రమైన సోదరభావాన్ని మరింత బలోపేతంచేసే రక్షాబంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అకా చెల్లెండ్లకు ఎల్లవేళలా సోదరులు అండగా నిలబడుతారనే భావన రక్షాబంధన్లో ఇమిడి ఉన్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏటా శ్రావణ పౌర్ణమినాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకొనే రాఖీ పండుగ.. భారతీయ సంసృతి సంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని సీఎం కేసీఆర్ అన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సౌభ్రాతృత్వం మరింతగా పరిఢవిల్లాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసినవారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ తదితరులు ఉన్నారు.