CM KCR | ఎలక్షన్లు రాంగనే వస్తరు.. ఆపదల మొక్కులు మొక్కుతరంటూ ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై సెటర్లు వేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మీ అందరినీ ఒకేది ఒకటే. ఎలక్షన్లు రాంగనే ఎవరో వస్తరు.. ఏదో చెబుతరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరు. అలవిగాని సామెతలు చెబుతరు. ఆపదల మొక్కులు కూడా మొక్కుతరు.. తీర్థం పోదంపా తిమ్మక్క అంటే.. నువ్వు గుల్లె.. నేను సల్లే.. యాడికి తోలుకపోతరో తెల్వదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నయ్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నయ్. మీకు పది ఛాన్స్లు ఇచ్చారు కదా.. 60 ఏళ్లు రాజ్యం మీరే వెలుగబెట్టారు కదా? ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనందరికీ సిగ్గుచేటు’ అన్నారు.
‘75 సంవత్సరాల తర్వాత కూడా మన దళితులు పేదరికంలో ఉన్నారంటూ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. 60-70కిందట దళితబంధులాంటి పథకం ప్రారంభించి ఉంటే ఇవాళ దళితుల్లో ఎందుకు పేదరికం ఉండుంటే ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిదీ..? ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారో.. వారికి 10-12 ఛాన్సులు ఇచ్చారు. వాళ్లు ఏం చేయలేదు. పెన్షన్లు ఇచ్చారు.. ఎన్ని ఇచ్చారు ? మనం రూ.40, రూ.70, రూ.200 పెన్షన్లను చూశాం. నేను ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు ఎందుకు ఇవ్వాలని అడిగాను. దానికి ఏమైనా పర్పస్ ఉందా? పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అని అడిగాను.
పెన్షన్ను రూ.400 చెద్దామని నిపుణులు చెప్పారు. పెన్షన్లు ఇచ్చేందుకు కారణం చేత ఇస్తామని అడిగాను. దురదృష్టవశాత్తు మానవ సమాజంలో కొందరు విధి వంచితులు ఉంటారు. మంచిగున్న మనిషి కూడా ప్రమాదంలో దివ్యాంగులు కావొచ్చు. కొందరు పుట్టకతోనే దివ్యాంగులు కావొచ్చు. కొందరు ఆలనా పాలనలేని స్త్రీలు, వృద్ధులుంటారని ఆలోచించించాం. ఆఫీసర్లు రూ.650 వరకు ఇవ్వాలని చెప్పినా వినకుండా రూ.1000 పెన్షన్ ఇచ్చాం. టర్మ్ తిరిగే సరికి రూ.2000వేలకు పెంచాం. మళ్లీ పెన్షన్ను రూ.5వేల పెంచబోతున్నట్లు ప్రకటించాం. ఓట్ల కోసం ఒకటే రోజులో ఇస్తామని చెప్పలేదు. గవర్నమెంట్ రాగానే పెన్షన్ను రూ.3వేలకు పెంచుతాం. రూ.500 పెంచుకుంటూ ఐదుసంవత్సరాలు పూర్తయ్యే సరికి రూ.5వేలకు పెంచుకుంటూ పోతాం’ అని తెలిపారు.
రైతుబంధు ఎవరూ అడగలేదు. రైతుబంధు ఇవ్వాలని గతంలో ఎన్నడూ లేదు. గతంలో డబ్బులు కట్టకపోతే దర్వాజలు పీక్కుపోయేది. రైతులు ఊళ్లల్లో నుంచి పారిపోయేది. రైతులను నిటబెట్టాలని, ప్రభుత్వం సపోర్ట్ లేకుండా రైతు నిలబడడని రైతుబంధు తీసుకువచ్చాం. రూ.10వేలు ఇస్తున్నాం. నేను ఇవాళ ప్రకటించా.. ఇప్పుడు తెలంగాణ పరిస్థితులు మారాయి. గతంలో హుస్నాబాద్కు వస్తే కండ్లల్లో నీళ్లు వచ్చాయి. ఎక్కడ చూసినా బొగ్గునాల బొగుడ. పంటలు ఉండేది కాదు. ఏసిన మామిడి, బత్తాయి చెట్లు ఎండిపోతుండే. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండలతో నీళ్లు పోసి కాపాడుకున్నటువంటి దుస్థితి ఉండేది. 600-700 ఫీట్లు వేస్తే బోరుపడేది కాదు.
హుస్నాబాద్ వాగుమీద ఒక్క చెక్డ్యామ్ ఉండేది కాదు. నీళ్ల చుక్క కనిపించేది కాదు. ఇవాళ హెలికాప్టర్ల నుంచి రెండుమూడు చెక్డ్యామ్లు వరుసగా కనిపిస్తున్నయ్. రెండు ఒడ్లు పట్టుకొని నీళ్లు కనిపిస్తున్నయ్. ఈ పద్ధతుల్లో మిషన్ కాకతీయ, చెక్డ్యామ్లు, కరెంటు పరిస్థితి మంచిగ చేరసుకున్నాం. ఇవాళ ఓట్లు అడిగేటోళ్ల జమానాలో కరెంటు పరిస్థితి ఎట్లుండే. 50ఏళ్లు రాజ్యం చేసినోళ్ల కాలంలో ఏ పరిస్థితుల్లో ఉండే. ట్రాన్స్ఫార్మర్లు కాలుడు.. మోటారు కాలుడు.. పంట పండేలోపల.. మోటరు కాలుడు.. వచ్చిన నాలుగు రూపాలు దానికే పోవుడు. ట్రాన్స్ఫార్మర్ కాలిదంటే గతంలో బాయికి రూ.2వేలు, రూ.3వేలు వసూలు చేసేది. ఇప్పుడా పరిస్థితులు తెలంగాణలో లేవు’ అని వివరించారు.