CM KCR | హైదరాబాద్ : గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భారీ వర్షాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అంశంతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.