హనుమకొండ/కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్కు వెళ్లిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కుమారుడి పెండ్లికి హాజరయ్యారు. రోడ్డుమార్గంలో కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్భవన్కు రాత్రి 10.10 గంటలకు చేరుకొని ఇక్కడే రాత్రిబచేశారు. మరుసరి రోజు ఉదయం 10:30 గంటలకు టీఆర్ఎస్ నేత రూప్సింగ్ కూతురు పెండ్లికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:30కు కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్లనున్నారు.