హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుతుగున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణంపై కూడా చర్చిస్తారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకుంటారు. చివరిగింజ వరకు రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు. అలాగే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.