CM KCR | చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డిని లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కొంచెం మనసు బాగా లేదు. కారణం ఏంటంటే మనం ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్తున్నాం. సమస్యలపై యుద్ధం చేస్తున్నాం. శత్రువులను సైతం ఇబ్బందిపెట్టలేదు. శ్రీనివాస్రెడ్డి ఎలా అయితే అజాతశత్రువుగా బాన్సువాడలో ఉంటరో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రాష్ట్రంలో అలాగే ఉన్నాం.
దురదృష్టం ఏంటంటే.. చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చాతగాని వెదవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డిపై కత్తిపోట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డారు. ఇంతకుముందే హైదరాబాద్కు తరలించారు. నేను జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడికి హరీశ్రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదు. మీ కార్యక్రమం ముగించుకొని రండి మీమంతా ఉన్నాం.. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది. కానీ, ఇది రాజకీయమా? అరాచకమా ? అంటూ ధ్వజమెత్తారు.