CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు చేరుకున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరనున్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు, పలువురు నేతలు, ఆయన మద్దతుదారులు హైదరాబాద్( Hyderabad )కు చేరుకున్నారు. భారీ కాన్వాయ్తో శరద్ జోషి ప్రణీత్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదంతో పాటు పలువురు తెలంగాణ భవన్కు చేరుకున్నారు.
కంధార్ లోహా( kandhar Loha ) లో బీఆర్ఎస్( BRS Party ) బహిరంగ సభ విజయవంతం కావడంతో.. పార్టీలోకి చేరికలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం కేసీఆర్( CM KCR ) సమక్షంలో ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్( Abhay Kailasrao Chikatgaonkar ) పార్టీలో చేరారు. ప్రగతి భవన్( Pragathi Bhavan )లో అభయ్ కైలాస్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్.