హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడురోజుల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో పాలొన్న తర్వాత ఆయన సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట ఢిల్లీ వెళ్లినవారిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, మాజీమంత్రి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. ఢిల్లీలో శనివారం కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, జలా ల పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. 26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధా న్యం కొనుగోలు అంశంపై కేంద్ర అహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్కు తిరిగివస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.