సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్ 2022పై స్పందించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణమైన బడ్జెట్ అన్నారు. క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను వసూలు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రస్తావించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. క్రిప్టో కరెన్సీ మీద 30 శాతం పన్ను ఎలా వస్తూలు చేస్తారు. క్రిప్టో కరెన్సీని మీరు ఒప్పుకున్నారా? అది అఫిషియలా? దీనికి మీ సమాధానం ఎంటి? నిర్మలా సీతారామన్ గారు చెప్పండి. ప్రధాని మోదీ గారు దీనికి ఏం సమాధానం చెబుతారు. ఏ ప్రాతిపదికన క్రిప్టో కరెన్సీ మీద పన్ను వసూలు చేస్తరు. ఇది సెన్స్లెస్ కాదా? మీరు ఏదైనా మాట్లాడుతరు.. మీకు నచ్చింది చేస్తరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. క్రిప్టో కరెన్సీని మీరు అఫిషియల్ చేశారా? అసలు కేంద్ర ప్రభుత్వానికి దిమాక్ ఉందా? అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.