హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరాపార్క్లో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాసంగిలో ధాన్యం కొంటారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలంటూ రెండు రోజులు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. మరో వైపు కేంద్రం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగా.. ఆయా అంశాలపై మాట్లాడే అవకాశం ఉన్నది. అలాగే హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను సైతం ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.