రామేశ్వర్రావు బీజేపీకి ‘వంద’ ఇచ్చారు కాబట్టే అయన్ను వదిలేశారని, ఆయన వంద ఇచ్చారు కాబట్టే.. మీరు (నలుగురు ఎమ్మెల్యేలు) ఇక్కడికి వరకు వచ్చారని పేర్కొన్నారు. బీజేపీ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేదంతా స్వామీజీలేనని, అందుకు రాజకీయనేతలంతా చిన్నజీయర్ స్వామి.. ఆ స్వామి ఈ స్వామి అంటూ వారి చుట్టే తిరుగుతుంటారని అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీలో బీఎల్ సంతోష్ ఏం చెబితే అదే ఫైనల్ అని, ఆయన్ను కాదని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఏమీ చేయలేరని ఆ పార్టీ ఢిల్లీ మధ్యవర్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చెప్పటం సంచలనం సృష్టిస్తున్నది. సంతోష్ నో అంటే అమిత్ షా కూడా ఏం చేయలేరని వారు పేర్కొన్నారు. ప్రతి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లోనూ సంతోష్ ఉంటారని, ఆర్ఎస్ఎస్ ఆయనకు అంత పవర్ ఇచ్చిందని తెలిపారు. ఏదైనా అవసరం ఉంటే మోదీ, అమిత్ షాలే ఆయన దగ్గరకు వెళ్తారే తప్ప.. బీఎల్ సంతోష్ మాత్రం వాళ్ల వద్దకు వెళ్లరని చెప్పారు.
తెలంగాణలో 35 మంది ఎమ్మెల్యేలపై ఈడీ లిస్ట్ రెడీ చేసినట్టు వెల్లడించారు. ఇక రామేశ్వర్రావు బీజేపీకి ‘వంద’ ఇచ్చారు కాబట్టే అయన్ను వదిలేశారని, ఆయన వంద ఇచ్చారు కాబట్టే.. మీరు (నలుగురు ఎమ్మెల్యేలు) ఇక్కడికి వరకు వచ్చారని పేర్కొన్నారు. బీజేపీ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేదంతా స్వామీజీలేనని, అందుకు రాజకీయనేతలంతా చిన్నజీయర్ స్వామి.. ఆ స్వామి ఈ స్వామి అంటూ వారి చుట్టే తిరుగుతుంటారని అన్నారు. తెలంగాణ తర్వాత ఏపీ, ఢిల్లీలో ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ మొదలుపెడుతామని తెలిపారు. ఎమ్మెల్యేలకు, బీజేపీ మధ్యవర్తులకు మధ్య జరిగిన సంభాషణ ఇదీ..
సింహయాజి: నాకెట్లా గ్యారెంటీ అని నందు అడిగారు. ఫోన్ చేసి పంపిచ్చిన.. స్వామి వద్దకు వెళ్లు (రామచంద్ర భారతి) పరిచయం చేస్తారు. నువ్వు నిర్ధారణ చేసుకొన్నాకే మళ్లీ రా అని చెప్పిన.
నందు: నేను కూడా చూడంది ఎలా చెప్పాలి. నాకు అన్ని పార్టీలో ఫ్రెండ్స్ ఉన్నారు. బండి సంజయ్ది ఏం నడవదు. అక్కడి నుంచి ఇది రాయాలంటే రాసివ్వాలి. కిషన్రెడ్డిని ఈ రోజు దిగిపోవాలంటే దిగిపోవాలి అంతే. సంతోష్ అంత పవర్ఫుల్.
సింహయాజి: ఇప్పుడు మీరంతా బీఎల్ సంతోష్ క్యాండిడేట్ లిస్ట్లో ఉన్నారు.. అర్థమైందా? అమిత్ షా, బీఎల్ సంతోష్ అంతా ఒక్కటే. మరొక విషయం.. బీఎల్ సంతోష్ నో చెబితే అమిత్ షా ఏం చేయలేరు. అంత పవర్ఫుల్ బీఎల్ సంతోష్. ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు. ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పిందే వినాలి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ బీఎల్ సంతోష్ కూర్చుంటారు.
గువ్వల బాలరాజు: ఆయనేమైన మినిస్టరా?
సింహయాజి : అక్కర్లేదు.. ఆయన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ.
నందు : ఏమైనా అవసరం ఉంటే.. మోదీ, అమిత్ షా ఆయనతో ఫోన్లో మాట్లాడుతారు. లేదంటే వాళ్లే ఈయన వద్దకు వస్తారు. అంతేగానీ బీఎల్ సంతోష్ మాత్రం వాళ్ల వద్దకు వెళ్లరు.
సింహయాజి : ఎందుకంటే ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆ పవర్స్ ఇచ్చింది.
సింహయాజి : బీజేపీని అంతా ఆర్గనైజ్ చేసేది స్వామీజీలే. వీళ్లంతా వెళ్లి చిన్నజీయర్ స్వామీజీని, ఆ స్వామి ఈ స్వామిజీలనే ఎందుకు మొక్కుతారు.
నందు : వీళ్లు అన్ని రాష్ర్టాల్లోకి పోతారు.
నందు : ఆర్ఎస్ఎస్లో నెం.1 మోహన్ భాగవత్, నెం.2 దత్తాత్రేయ మెహతా, నెం. 3 బీఎల్ సంతోష్. వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నారు. వీళ్లు ఆరుగురే అంతా చూసుకొనేది.
నందు : మీకు చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు ఏదంటే అది. (ఫోన్లో బీఎల్ సంతోష్ ఫోటోను గువ్వల బాల్రాజ్కు చూపించారు)
నందు : బీఎల్ సంతోష్ ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ చేశారు.
నందు : మీరు కావాలంటే సింహయాజీతో పర్సనల్గా మాట్లాడొచ్చు. వాళ్లను కూడా ఓసారి పర్సనల్గా కలుద్దాం.
గువ్వల బాలరాజు : ఏపీలో ఎలా ఉంది స్వామి.. ఆపరేషన్ ఆకర్ష్?
సింహయాజి : ఇక్కడ పూర్తయితే అక్కడ మొదలు పెడతాం (నవ్వుతూ).
రోహిత్రెడ్డి : వీళ్లు నాతో నెల నుంచి టచ్లో ఉన్నారు. క్యాష్ ఎక్కడ ఉంటుందో మనకు చెప్తారు.. అక్కడికి వెళ్లి మనం కలెక్ట్ చేసుకోవాలి.
గువ్వల బాల్రాజు : మునుగోడుతో ఇక్కడ గవర్నమెంట్ పడిపోతది అంటున్నరు. మీ ఆపరేషన్ ఢిల్లీలో ఫెయిలైనట్టు ఉన్నది కదా!
సింహయాజి : అక్కడ ఇప్పుడు మొదలైతది. 36 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఒకడిని (సిసోడియాను ఉద్దేశించి) ఈడీ పెట్టి ఎత్తేశాం కదా. సిసోడియాతోనే మాకు ఎమ్మెల్యేలు వస్తున్నారు తెలుసా? రాజస్థాన్లోనూ 30 మంది ఎమ్మెల్యేలను రెడీ చేశారు.
సింహయాజి: వింటే గోడి (సఖ్యత, ఫ్రెండ్షిప్) లేదంటే ఈడీ. ఇప్పుడు తెలంగాణలో 35 మంది ఎమ్మెల్యేలు ఈడీ లిస్ట్లో ఉన్నారు. వింటేనేమో జోదీ.. లేదంటే ఈడీ అటాక్ అంటాం.
నందు : స్వామి వద్ద లిస్ట్ ఉంది. బీఎల్ సంతోష్ వాళ్లు లిస్ట్ ఇచ్చారు. ఏం చేయాలనేది రామచంద్ర భారతి స్వామికి చెబుతారు.
సింహయాజి: రామేశ్వర్రావును వదిలేశారు. ఎందుకంటే బీజేపీకి వంద ఇచ్చేశారు. ఆ వంద ఇచ్చారు కాబట్టే మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చారు. లేకుంటే ఎందుకొస్తారు. ఆయన చేసిన ఈవెంట్కు అమిత్షా, మోదీ అందుకే వచ్చారు.
నందు : అది చాలా పెద్ద డీల్.
సింహయాజి: రామేశ్వర్రావుపై ఓ కేసు ఉన్నది. దాని నుంచి తప్పించుకొనేందుకు డబ్బులివ్వడంతో పాటు మళ్లీ ఫేవర్ చేసుకొనేందుకు వాళ్లను ఆహ్వానించారు.
గువ్వల బాలరాజు : ఇక్కడైతే బండిదేదీ నడవదు.
సింహయాజి : బండిదేమీ ఉండదు. బండికి గండే. కిషన్రెడ్డికి కూడా అంతే.
గువ్వల బాలరాజు : పూర్తి స్వేచ్ఛనిచ్చి పార్టీని నడుపాలని అడిగితే నడిపేవారు ఎవరూ లేరా ఇక్కడ?
సింహయాజి: ఇక్కడ ఆ విధంగా లేరు. ఇప్పుడు తయారు చేస్తారు. కొత్త రక్తం వస్తే. వాళ్లకు అంటగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మేం ఏం అనుకుంటున్నామంటే.. ఆ బాధ్యత మీకు (నలుగురు ఎమ్మెల్యేలకు) కట్టబెడదాం అనుకుంటున్నాము.
రోహిత్రెడ్డి : మా కన్నా బోలెడు మంది సీనియర్లు ఉన్నారు.
సింహయాజి: సీనియర్లు ఉంటే సరిపోదు కదా..? కెపాసిటీ కూడా ఉండాలి.
నందు : ఇక్కడ కిషన్రెడ్డి ఏం చేసిండు, బండి సంజయ్ ఏం చేసిండు అనేది చిట్టా అంతా మోదీ వద్ద ఉన్నది. ఎవర్ని ఎక్కడ కట్ చేయాలో ఆయనకు (మోదీకి) బాగా తెలుసు.
నందు : వెంకయ్య నాయుడిని డమ్మీ చేయ్యలేదా..? రాష్ట్రపతి ఇవ్వకుండా. ఇప్పుడు వాళ్ల బ్యాచ్ అంతా రిటైర్డ్.
సింహయాజి : బండి సంజయ్, కిషన్రెడ్డి ఏదోదో చెబుతారు. కానీ వాళ్లకు మోదీ, అమిత్షా అపాయింట్మెంటే దొరకదు. బీఎల్ సంతోష్ చాలా సీక్రెట్గా, పర్సనల్గా ఉంటారు. పీఎం మోదీనే వచ్చిపోతారంటే ఏం అనుకోవాలి.
బీఎల్ సంతోష్ ఎంత చెబితే అంత…