CM KCR | వరంగల్ : వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆరూరి రమేశ్ మెజార్టీ తన మెజార్టీ కంటే ఎక్కువ రావాలన్నారు కేసీఆర్. వర్ధన్నపేట నియోజవకర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఆరూరి రమేశ్ను గెలిపిస్తరని ఈ సభను చూస్తుంటే రుజువైపోయింది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున కదిలివచ్చారంటేనే.. అర్థమైపోతుంది. ప్రజల్లో ఉండే మంచి నాయకుడు ఆరూరి రమేశ్ అని. గత రెండు ఎన్నికల్లో ఒకసారి 80 వేలు, ఇంకోసారి 90 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారు. రమేశ్ మెజార్టీ నా కంటే ఎక్కువ రావాలి. లక్ష మెజార్టీ రావాలని కోరుతున్నాను అని కేసీఆర్ అన్నారు.
వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయింది అని కేసీఆర్ తెలిపారు. దాదాపు 40 గ్రామాలను వరగంల్ పట్టణంలో విలీనం చేశారు. ఎన్నికల తర్వాత ఆ గ్రామాల ప్రజలకు సాదా బైనామాకు అవకాశం కల్పిస్తాం. ఈ గ్రామాలకు ప్రత్యేక ఫండ్ మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగ కల్పనలో ముందుకు తీసుకుపోతాం. ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరుతున్నా. ప్రజల మనిషిగా ఉన్న ఆరూరి రమేశ్ను మళ్లీ గెలిపించాలని కోరుతున్నా. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ ఈ వర్ధన్నపేటకు చెందినవారే. వారి ఆశీస్సులు కూడా రమేశ్కు ఉంటాయి. అందరూ కలిసి వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరుతున్నానని కేసీఆర్ పిలుపునిచ్చారు.