CM KCR | గజ్వేల్ : ఒకనాడు చుక్క నీళ్ల కోసం తపించిన గజ్వేల్.. ఇవాళ 12 జిల్లాలకు నీళ్లు పంపించే ఖజానా అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచే చాలా నియోజకవర్గాలకు, జిల్లాలకు నీళ్లు తరలుతున్నాయని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ముంపు గ్రామాల ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. వాళ్ల త్యాగమే.. ఒకనాడు చుక్క నీళ్ల కోసం తపించిన గజ్వేల్ ఇవాళ 12 జిల్లాలకు నీళ్లు పంపించే ఖజానా అయింది. మల్లన్న సాగర్ నుంచే చాలా నియోజకవర్గాలకు, జిల్లాలకు నీళ్లు పోతున్నాయి. భువనగిరి, ఆలేరు, దుబ్బాక కావొచ్చు.. సింగూరు ప్రాజెక్టుకు, నారాయణఖేడ్, నిజాం సాగర్కు మల్లన్న సాగర్ నుంచే నీళ్లు పోతాయి. ఎవరైతే నిర్వాసితులు అయ్యారో.. వాళ్ల ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను.. వారి యెడల నా మనసులో మార్గం ఉంది. తప్పకుండా అది కూడా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కొండపోచమ్మ దేవాలయం ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం. నాచారం దేవాయలన్ని కూడా అద్భుతంగా తయారు చేసుకుందాం. ఇంకో మాట తెలియజేస్తున్నా.. గజ్వేల్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది. మాకు స్థలాలు ఇప్పించండి వచ్చి ఐటీ టవర్లు పెడుతామని కోరుతున్నారు. కేటీ రామారావుకు చెప్పాను ఆల్రెడీ. పరిశీలన జరగుతుంది. గజ్వేల్కు ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది. ప్రతి మండల కేంద్రంలో అద్భుతమైన మార్కెట్ యార్డు కూడా నిర్మాణం చేసుకుందాం. మల్లన్న సాగర్ వద్దకు టూరిస్టులు వస్తారు. ఎందుకంటే వాగు, నది లేకుండా రింగ్ బండతో కట్టిన రిజర్వాయర్.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద 50 టీఎంసీల ప్రాజెక్టు మన మల్లన్న సాగర్. దాన్ని అనుసరించుకొని 7 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటిస్తున్నా. తప్పకుండా మల్లన్న సాగర్ పనులు పూర్తవుతున్నాయి. టూరిస్ట్ స్పాట్గా తయారు చేస్తానని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక్కడికి పరివ్రమలు వస్తాయంటే నేనే వద్దనే చెప్పాను. వాడొచ్చి కాలుష్యం పెట్టి, మన పొలాలు కరాబ్ చేసి మన ఏరియా పొల్యుషన్ చేస్తే మనం ఇబ్బందులు పడుతాం. కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని కోరాం. రాబోయే కాలంలో డజన్ పరిశ్రమలు గజ్వేల్కు వస్తాయని మనవి చేస్తున్నా. ప్రాసెస్లో ఉంది. కమర్షియల్ క్రాప్స్ వేసుకుందాం. రైల్వే సదుపాయం వచ్చింది కాబట్టి.. ఎక్కడికి అంటే అక్కడికి దేశం నలుమూలల మన పంటలు పంపించే అవకాశం ఉంటది. జోన్లుగా విభజించుకుని, రైతులకు లాభం వచ్చేలా చేసుకుందాం అని కేసీఆర్ చెప్పారు.