CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
సామాజిక సమస్యలను, అన్యాయాలను తట్టుకోలేక ప్రజల కోసం ‘తన గొడవ’ను కవిత్వం ద్వారా సున్నితంగా ఆవిషరించిన కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున ప్రతియేటా పురసారాలను అందిస్తూ ప్రభు త్వం గౌరవించుకుంటున్నదని చెప్పారు. ఏటా ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురసారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి జయరాజుకు సీఎం మరోసారి అభినందనలు తెలిపారు.