హైదరాబాద్ : తెలంగాణ జల వనరుల నిపుణులు, ప్రభుత్వ సాగునీటి రంగ మాజీ సలహాదారు, రచయిత దివంగత ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు.
తెలంగాణకు టీఎంసీల్లో సాగునీటి సోయి నేర్పుతూ, సమైక్య వాదుల జల దోపిడీపై జీవితాంతం పోరాడిన గొప్ప జల ఉద్యమకారుడు ఆర్ విద్యాసాగర్ రావు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్ విద్యాసాగర్ రావు సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.