హైదరాబాద్ : తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. మరికాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో కాసేపటి క్రితం కుమారస్వామి, ఇతర నేతలతో కలిసి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.