హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా సోమవారం హరితోత్సవం (Haritotsavam) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు నాటనున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు.
కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.