హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి వేములను, ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా, మంజులమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం ప్రగతిభవన్ నుంచి వేల్పూర్కు చేరుకున్నారు. మంత్రి వేముల మాతృమూర్తి మంజులమ్మ (77) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మంజులమ్మకు గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. pic.twitter.com/ROx90QF9DM
— Namasthe Telangana (@ntdailyonline) October 13, 2023