రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించారు. విద్యాసంస్థలన్నింటికీ 9 రోజులు సెలవులు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు.
వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ పెట్టే అవసరం ఉందా? అనే అంశంపై అధికారులు స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వివరించారు. అయితే బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చూడాలని సూచించారు.