Minister Jagadish Reddy | యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని.. వాళ్ల అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. సూర్యాపేటలోని ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారిపై ఐలాపురం వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించనున్న యాదవ సంక్షేమ భవన్కు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రేరణ ఇవ్వడానికి యాదవ సంఘం భవనం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ భవన నిర్మాణాన్ని ఏడాదిలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఏ అండ లేని యాదవ సోదరులకు యాదవ సంక్షేమ భవన్ అండగా నిలవాలని ఆకాంక్షించారు.
యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గొల్ల, కుర్మలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందని చెప్పారు. దీంతో మాంసం ఉత్పత్తిలోని తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు. గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు మాదిరిగానే చూశాయని, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది యాదవులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని అన్నారు. నల్లగొండ జిల్లాలోనే ఇద్దరు యాదవ ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉండటం.. యాదవ పక్షపాత ప్రభుత్వం బీఆర్ఎస్ అనడానికి నిదర్శనం అన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు గా అవకాశం కల్పించి రాజకీయంగా పెద్దపీట వేశామని గుర్తు చేశారు. నమ్మకానికి మారుపేరుగా ఉన్న యాదవులు ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి అండగా నిలబడి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.