హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం రాత్రి ప్రముఖ జర్నలిస్ట్ రచయిత ప్రణయ్ రాయ్తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఇవాళ మధ్యాహ్నం సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్యాదవ్ భేటీ అయ్యారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రితోనూ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలతో పాటు మోహల్లా క్లినిక్ను సందర్శించారు. పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్తో కలిసి కేసీఆర్ వీక్షించారు.
పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సీఎంలు ఇద్దరు గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్నారని కొనియాడారు. ఆ తర్వాత మోహల్లా క్లినిక్నులను పరిశీలించి, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.